16-06-2025 08:03:16 PM
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్..
హనుమకొండ (విజయక్రాంతి): సోమవారం కలెక్టరేట్ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీలను స్వీకరించిన కలెక్టర్, జిల్లా అధికారులు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు సత్వర పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్(District Collector Sneha Shabarish) ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ, గృహ నిర్మాణ, భూ రికార్డులు సర్వే, విద్యుత్, మున్సిపల్, విద్య, పోలీస్, సాగునీటి పారుదల, ఆర్ అండ్ బి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, వైద్య ఆరోగ్య, కుడా, ఉపాధి కల్పన, వ్యవసాయ శాఖ, మైన్స్, కోశాధికారి, తదితర శాఖలకు సంబంధించి 145 అర్జీలను ప్రజలు అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేష్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ కె. నారాయణ, సిపిఓ సత్యనారాయణ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.