13-11-2025 05:54:30 PM
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య
నకిరేకల్ (విజయక్రాంతి): పాలకుల అసమర్థ విధానాలతో గ్రామీణ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని వాటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం క్షేత్రస్థాయి పరిశీలన చేసి పరిష్కారం చూపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లల పెంటయ్య, సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం కోరారు. గురువారం సిపిఎం జిల్లా కమిటీ పిలుపుమేరకు రామన్నపేట మండలంలో కొమ్మాయిగూడెం, మునిపంపుల, దుబ్బాక, బొగారం గ్రామాల్లో వేరువేరుగా ఇంటింటి కుటుంబ గ్రామీణ సర్వే నిర్వహించి ప్రజలను నేరుగా కలిసి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగిందని వారు తెలిపారు. ఈ మండలంలో మూడు రోజులపాటు గ్రామీణ కుటుంబ సర్వేను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో అత్యధికంగా వ్యవసాయ ఆధారిత రైతు, కూలీ కుటుంబాలు అప్పులు చేసి ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు చివరికి ఎలాంటి లాభం లేక అప్పుల పాలవుతూ అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతికత, నూతన యంత్రాలు వాడినా పెట్టుబడి పోను చేతికి చిల్లర కూడా మిగడం లేదని వాపోతున్నారని వారు పేర్కొన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి కనీసం ఇల్లు గడవడం లేదని చేసే కూలీ పనికి వచ్చిన డబ్బులతో సంసారం గడవక ప్రైవేటు ఫైనాన్స్ లు తీసుకొస్తే వారు వేధింపులకు గురి చేస్తున్నారని వారు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు లేక నాణ్యమైన విద్య అంధక పోటీ ప్రపంచంలో ప్రైవేటు బడుల్లో చేర్పిస్తూ ఫీజులు కట్టలేక పోతున్నారని పేర్కొన్నారు.
వచ్చే ఆదాయం పూర్తిగా చదువులకు దీర్ఘకాలిక రోగాలకు ఖర్చవుతుందని వారు తెలిపారు. వెంటనే ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేసి సమస్యలు పరిష్కరించాలని వచ్చిన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అనంతరం పోరాట కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని సమస్యల రూపం మాపడం కోసం ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వనం ఉపేందర్ బల్గూరి అంజయ్య మండల కార్యదర్శి వర్గ సభ్యులు బోయిని ఆనంద్, జంపాల అండాలు, కందుల హనుమతు, మండల కమిటీ సభ్యులు గొరిగే సోములు, భావండ్లపల్లి బాలరాజు, వేముల సైదులు, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు గంటపాక శివకుమార్ శాఖా కార్యదర్శులు తాళ్లపల్లి జితేందర్, శానగొండ వెంకటేశ్వర్లు, గుండాల ప్రసాద్,కూనూరు మల్లేశం, నాయకులు తొలుపులూరి చంద్రశేఖర్, గుండాల నరేష్, ఎర్ర కాటమయ్య, బూడిద బిక్షం, కుక్కడపు స్వామి, శానాగొండ రామచంద్రం, గట్టు గోపయ్య, గుండాల అనిల్ కుమార్, గాదె రాజకుమార్, అంతటి సత్తయ్య, కూనూరు జంగయ్య, గుణగంటి మల్లేశం,తుర్కపల్లి నరేష్, బాణాల నవీన్ రెడ్డి, జల్లెల మల్లేశం, సాయి, సందీప్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.