calender_icon.png 21 December, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఎస్సీలు పాలనకు వెన్నుముకలు

21-12-2025 12:00:00 AM

  1. పరీక్షల నిర్వహణలో వార్షిక క్యాలండర్ తప్పనిసరి 

టీజీపీఎస్సీ విజయవంతంగా నిర్వహిస్తోంది

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

రామోజీ ఫిలింసిటీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్‌పర్సన్ల 26వ జాతీయ సదస్సు ముగింపు 

రంగారెడ్డి, డిసెంబర్ 20 (విజయక్రాంతి): పబ్లిక్ సర్వీస్ కమిషన్లు దేశ పరిపాల నా వ్యవస్థకు వెన్నెముకలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. న్యాయమైన, పారదర్శకమైన, సమగ్ర నియామక విధానాల ద్వారానే ప్రజాసేవలో ప్రతిభకు సరైన స్థానం దక్కుతుందని స్పష్టం చేశారు. శనివారం రామోజీ ఫిలిం సిటీలో రెండు రోజులపాటు నిర్వహించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్‌పర్సన్ల 26వ జాతీయ ముగిం పు సదస్సుకు భట్టి విక్రమార్క హాజరై మాట్లాడారు.

పరీక్షల నిర్వహణలో వార్షిక క్యాలెండర్ తప్పనిసరిగా ఉండాలని, దానికి కట్టుబడి వ్యవహరించాల్సిన అవసరం ఉం దన్నారు. పరీక్షల్లో జాప్యం వల్ల యువతలో నిరాశ పెరుగుతోందని, అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందస్తు ప్రణా ళికతో పరీక్షలు నిర్వహించాల్సిన బాధ్యత కమిషన్లపై ఉందన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవంతంగా జాబ్ క్యాలెండర్ నిర్వహిస్తోందని చెప్పారు. ప్రశ్నాపత్రాల తయారీ నుంచి తుది ఎంపిక వరకు ప్రతి దశ స్పష్టంగా, సందేహాలకు తావులేకుండా ఉండాలన్నారు.

ప్రశ్నాపత్రాల లీకేజీ లు ప్రజాసేవ విలువలకు విరుద్ధమని, ఇవి అభ్యర్థుల కలలను చిదిమేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. లీకేజీలను అడ్డుకునేందుకు ఆధునిక భద్రతా వ్యవస్థలు అమలు చేయాలని, సిబ్బందికి నైతిక విలువలపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. తప్పిదాలు చోటుచేసుకుంటే వేగంగా, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటర్వ్యూలు కేవలం జ్ఞాన పరీక్షలకే పరిమితం కాకుండా వ్యక్తి త్వం, నైతికత, నిర్ణయ సామర్థ్యాన్ని అంచనా వేసేలా ఉండాలని సూచించారు. విభిన్న నేపథ్యాల నిపుణులతో ఇంటర్వ్యూ బోర్డులు ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అమలులో కమిషన్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. రిజర్వేషన్లు కేవలం సంఖ్యలకే పరిమితం కాకుండా వాస్తవికంగా ఫలితాలు ఇచ్చేలా చూడాలన్నారు. అర్హులైన అభ్యర్థులు అవకాశాలు పొందేలా కోచింగ్, సడ లింపులు, పర్యవేక్షణ వ్యవస్థలు ఉండాలని సూచించారు. కోర్టుల తీర్పుల నుంచి పాఠా లు నేర్చుకొని వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు.

పబ్లిక్ సర్వీస్ కమిషన్లు రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థలని, రాజకీయ ప్రభావాలకు లోనుకాకుండా పని చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సద స్సు చర్చలు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలవ్వాలని కోరారు. విశ్వాసాన్ని పునర్నిర్మించి, ప్రతిభకు సమానత్వం తో అవకాశం కల్పిస్తూ, పబ్లిక్ సర్వీస్ కమిషన్లను నిజాయితీకి ప్రతీకగా నిలపాలని డిప్యూటీ సీఎం భట్టి పిలుపునిచ్చారు.