22 May, 2026 | 7:43 PM

Breaking News

ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •   వేతన పెంపు హర్షణీయం: మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్   •   కామారెడ్డి డిఆర్డిఓగా దామోదర్ రెడ్డి   •   దోమకాటు వ్యాధుల పట్ల... ప్రజలకు అప్రమత్తత అవసరం   •   సర్కారు భూముల్లో అక్రమ నిర్మాణాలను సహించేది లేదు   •  

ఐఐఐటీ క్యాంపస్‌లో పీయూసీ విద్యార్థి ఆత్మహత్య

21-08-2025 11:34 AM

అమరావతి: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీద్‌పేటకు చెందిన నరసింహనాయుడు అనే ద్వితీయ సంవత్సరం పీయూసీ విద్యార్థి కడప జిల్లా వేంపల్లి మండలం ఐఐఐటీ ఇడుపులపాయ ఆవరణలోని ఐఐఐటీ ఒంగోలు క్యాంపస్‌లో(IIIT Ongole Campus) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్యాంపస్‌ సిబ్బంది సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.