calender_icon.png 24 June, 2025 | 3:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక పారదర్శకంగా జరగలేదు

04-06-2025 12:00:00 AM

 -ఉన్నవారికే ఇండ్లు మంజూరు

 -అద్దె భవనాలలో, గుడిసెలలో నివసించే   వారికి కట్

 -ఎంపీడీవోపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తాం

- అధికారుల తీరుపై సీ పీ ఐ శ్రేణుల ధ్వజం

చిగురుమామిడి, జూన్ 3(విజయక్రాంతి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా అమలుపరిచిన ఇందిరమ్మ ఇండ్ల పథకం,  రాజీవ్ యువ వికాస్ పథకం ఎంపికలో అనేక తప్పు లు జరిగాయని సీపీ ఐ నాయకులు ధ్వజమెత్తారు. నిరుపేద, అద్దె ఇండ్లలో ఉంటున్న వారికి ఇండ్లు రాలేదని,  రాజు యువ వికాస్ ఎంపికలో చేతివాటం జరిగిందని, ఈ ఎంపిక ప్రక్రియ లో అధికార పార్టీ నేతల జోక్యం తగదని  మండిపడ్డారు.

అధికార పార్టీ నేతలకు అండగా నిలుస్తూ అర్హులైన వారిని ఎంపిక చేయడంలో ఎంపీడీవో వ్యవహార శైలి సరిగా లేదని, ఎం పీ డీ వో పై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మంగళవా రం చిగురుమామిడి మండల కేంద్రంలోని ముసుగు రాజిరెడ్డి స్మారక భవనంలో సీపీఐ మండల శాఖ కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే స్వామి, సీపీఐ మండల శాఖ కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వివిధ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్ర భుత్వం  ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు.

గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రత్యేక అధికారితో కమిటీలు వేసినా గ్రామ సభలు నిర్వహించ కుండా అధికారులు ఏకపక్షంగా వ్యవహారిస్తూ అధికార పార్టీ వారికీ అనుకూలమై న వారికే ఇండ్లు మంజూరు చేసారని మండిపడ్డారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయలేదని ఆరోపించారు.  అనేక మంది అద్దె ఇంట్లో ఉంటున్న వారికీ మంజూరు చేయకపోవడం దారుణమని, ఇండ్ల ఎంపికలో కూడా కొంతమంది దళారులు ఇండ్లు ఇప్పిస్తామని డబ్బులు కూడా డి మాండ్ చేస్తున్నట్టు తెలుస్తోందని ఆరోపించారు.  గ్రామాల్లో అధికారుల నియంత్రణ కొరవడిందని ఆగ్రహం వ్యక్తం చేసా రు.

రాత్రికి రాత్రే రాజీవ్ యువ వికాస్ పథకం కింద ఇంటర్వ్యూలు నిర్వహించిన సంఘటనలో కేవలం జిరాక్స్ ప్రతులను తీసుకొని రాత్రికి రాత్రి 12 గంటల సమయంలో లబ్ధిదారులను ఎంపిక చేయడం చాలా విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మండల అభివృద్ధి అధికారిగా విధులు నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా వ్యవహరించారని దుయ్యబట్టారు. రాజీవ్ యువ వికాస్ ఎంపిక ఒక కమిటీ ద్వా రా జరగాలని, అలాకాకుండా కాంగ్రెస్ కార్యకర్తలు, మండల అధికారులు ఇష్టం వచ్చినట్లు ఎంపిక చేశారని దుయ్యబట్టారు.

పార్టీలకతీతంగా జరగాల్సిన ఎంపికలో అధికార పార్టీ నేతల హస్తం ఉండడం సరైనది కాదని, లబ్దిదారుల ఎంపికపై, ఎంపీడీవో వ్యవహార శైలిపై కలెక్టర్, జిల్లా పరిషత్ సీఈ వో కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ ఎంపికపై  కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించి అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ప్రతి పథకం అర్హులైన వారికి అందేలా కలెక్టర్ చొరవ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అందె స్వామి, కాంతాల శ్రీనివాస్ రెడ్డి, మండల సహాయ కార్యదర్శులు బూడిద సదాశివ, పైడిపల్లి వెంకటేష్, రైతు సంఘం మండల కార్యదర్శి గోలి బాపురెడ్డి పాల్గొన్నారు.