01-12-2025 06:33:46 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): పరిశోధనా స్కాలర్ ఎం. రాధిక అనురాగ్ విశ్వవిద్యాలయ నిబంధనలలో సూచించిన అధ్యయన కోర్సును అభ్యసించి తాప వికిరణం ప్రభావం, నానోఫ్లూయిడ్ వేడి ద్రవ్య ప్రసరణ బౌండరీ లేయర్ ప్రవాహ సమస్యలు ప్రసారిత ఉపరితలంపై ఒక సంఖ్యా సాంకేతిక పద్ధతి అనే పి.హెచ్.డి థీసిస్ను ప్రొఫెసర్ వై. ధర్మేందర్ రెడ్డి (గణితశాస్త్ర విభాగం) పర్యవేక్షణలో సమర్పించిన తర్వాత ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతికు చెందిన డాక్టర్ సీఎచ్. మారియప్పన్ ఆధ్వర్యంలో జరిగిన వైవా పరీక్షలో ఉతీర్ణత సాధించారు. పరీక్షకుల ప్యానెల్ సిఫార్సుల మేరకు ఎం. రాధికను డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పి.హెచ్.డి.) అవార్డుకు అర్హత సాధించారని ప్రకటించారు.