1 July, 2026 | 11:14 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరు శ్రద్ధ చూపాలి

01-12-2025 06:30 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): బస్తీలలో చెత్తను కాల్చడం చేయకూడదని తడి, పొడి చెత్తను వేరుచేయాలని, నీటిని పొదుపుగా వాడాలని, చెట్లను నాటి వాటిని సంరక్షించాలని, ప్లాస్టిక్ బదులుగా బట్ట సంచులను వాడాలని శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు, ఆచార్యులు సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలిలలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ప్రముఖ్ ఉడుతల శ్రీలక్ష్మి, సైదం శ్రీ రాం, సత్యనారాయణ, శ్రీకాంత్, బిళ్ళ అనూష, ఆత్రం కిరణ్, ప్రధానాచార్యులు గుండేటి కోటేశ్వరరావు పాల్గొన్నారు.