14 July, 2026 | 3:53 PM

Breaking News

మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •   కార్మికులకు ఆరోగ్య భరోసా   •   సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •   చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •  

విపక్ష నేతగా రాహుల్

26-06-2024 01:18 AM

లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా నియామకం

ప్రొటెం స్పీకర్‌కు తెలిపిన సోనియాగాంధీ

న్యూఢిల్లీ, జూన్ 25: లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీ నియమితులయ్యారు. ఆయనను ప్రతిపక్ష నేతగా నియమించినట్టు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియాగాంధీ ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్‌కు మంగళవారం లేఖ రాశారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే నేతృత్వంలో ఇండియా కూటమి నేతలు ఆయన నివాసంలో మంగళవారం రాత్రి సమావేశమయ్యారు. లోక్‌సభ స్పీకర్ ఎన్నికతోపాటు పలు అంశాలపై చర్చించారు.

ఈ సమావేశంలోనే రాహుల్‌గాంధీని ప్రతిపక్ష నేతగా ఉండేందుకు ఒప్పించినట్టు పార్టీ నేతలు తెలిపారు. నిజానికి ఆయన కొద్ది రోజుల ముందే ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్టు వార్తలు వచ్చాయి. ఇటీవల నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాహుల్‌గాను పార్టీ లోక్‌సభాపక్ష నేతగా ఎంపిక చేసింది. అయితే, ఆ పదవి చేపట్టం ఇష్టమో కాదో కూడా ఆయన వెంటనే చెప్పలేదు. తాజాగా ఇండియా కూటమి మొత్తానికి నాయకత్వం వహించే విపక్ష నేత పదవిని కట్టబెటింది. ఇందుకు ఆయన ఒప్పుకొన్నట్టు సమాచారం. రాహుల్‌గాందీ ఇప్పటివరకు ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.