28 August, 2026 | 1:54 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

రాజన్న క్షేత్రం.. భక్తజన సంద్రం

21-05-2024 02:07 AM

రాజన్న సిరిసిల్ల, మే 20 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్న భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేసి గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసి భక్తులకు శీఘ్రదర్శనం అమలు చేశారు. కోడె మొక్కులు చెల్లించకునే భక్తులు క్యూలైన్లలో 8 గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది. గుడిచెరువు మైదానం భక్తుల వాహనాలతో నిండిపోయింది. పట్టణంలోని శ్రీ భీమేశ్వరాలయం, బద్దిపోచమ్మ ఆలయాల్లో కూడా భక్తుల రద్దీ నెలకొంది.