తమిళ రాజకీయాలపై రజనీ ఆసక్తికర కామెంట్స్
25-08-2024 10:48 AM
చెన్నై: తమిళనాడు రాజకీయాలపై రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డీఎంకే పార్టీ మర్రి చెట్టు లాంటిదని రజనీకాంత్ వ్యాఖ్యనించారు. ఎలాంటి తుఫానునైనా ఎదుర్కొంటుందన్నారు. డీఎంకే మర్రి చెట్టును ఎవరూ కదిలించలేరన్న రజనీకాంత్ ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లో దిగిన వేళ రజనీ కామెంట్స్ హాట్ టాపిగ్గా మారాయి.






