17 April, 2026 | 11:41 AM

Breaking News

అర్హతగల ప్రతిఒక్కరికి రాజీవ్ యువవికాసం

30-05-2025 12:29 AM

- ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

నాగర్ కర్నూల్ మే 29 (విజయక్రాంతి); అర్హత గల ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధి చేకూరేలా సంబంధిత అధికారులు చర్యలు తీసు కోవాలని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు.

గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత మున్సిపల్ ఎంపీడీవో అధికారులతో రాజు యువ వికాసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను పథకం అమలుపై సమీక్ష జరిపారు.

అత్యంత నిరుపేద యువత యొక్క దరఖాస్తులను ముందు వరసలో ఉంచాలన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, ఎంపీడీవో కోటేశ్వర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.