సాయంత్రం తెలంగాణకు రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్(Union Defense Minister Rajnath Singh) నేడు తెలంగాణకు రానున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు బేగంపేట విమానాశ్రయ చేరుకోనున్నారు. రేపు తెలంగాణ విమోచన వేడుల్లో(Telangana Liberation Celebrations) రాజ్ నాథ్ సింగ్ పాల్గొని, పరేడ్ మైదానంలో జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారు. అనంతరం సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని పికెట్ పబ్లిక్ గార్డెన్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి(Atal Bihari Vajpayee) విగ్రహాన్ని రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించనున్నారు. ఎస్సీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డి. మధుకర్ నాయక్ కు అందిన షెడ్యూల్ ప్రకారం, రక్షణ మంత్రి ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరిగే హైదరాబాద్ లిబరేషన్ డే పరేడ్ కు హాజరవుతారు. ఆ తర్వాత ఉదయం 11.45 గంటలకు అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి పికెట్ పబ్లిక్ గార్డెన్ కు వెళతారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఆవిష్కరించనున్న సీనియర్ బీజేపీ నాయకుడి మొదటి విగ్రహం ఇది. రాజ్నాథ్ సింగ్ సింగ్ పర్యటన నేపథ్యంలో బీజేపీ నేతలు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.."ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ ప్రాంతంలో ఎప్పుడూ హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరుపుకోలేదు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సందర్భంగా, ప్రధాన మంత్రి మోడీ, హోం మంత్రి అమిత్ షా(Home Minister Amit Shah) ప్రతి సంవత్సరం హైదరాబాద్ విమోచన దినోత్సవానికి సంబంధించిన అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఇలా చేయడం ఇది మూడవ సంవత్సరం. ఈ సంవత్సరం, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇందులో పాల్గొనబోతున్నారు. ఇది ఒక పెద్ద కార్యక్రమం కానుంది. మేము ఒక డిజిటల్ మ్యూజియంను ప్రారంభించాము. దీని ద్వారా తెలంగాణ ప్రజలు తమ ఇంటి నుండి తమ ఫోన్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడవచ్చు. దాదాపు 1000 మంది కళాకారులు, పారామిలిటరీ దళాలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాయి. గ్రామస్తులు తమ గ్రామాల్లో తిరంగను కూడా ఎగురవేస్తారు." అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.




