22 July, 2026 | 7:17 PM

Breaking News

ధర్మేంద్ర ప్రధాన్ కాదు... మోదీ రాజీనామా చేయాలి   •   వర్షవాస్ కమిటీ అధ్యక్షుడిగా శ్యామ్‌ రావు ​ఏకగ్రీవం   •   వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ పతాక స్వీకారోత్సవం కార్యక్రమం   •   సర్ డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించిన మండల కోఆర్డినేటర్ సురభి రాజేష్   •   ఎవరెస్ట్ శిఖరంపై జెండా ఎగరాలి: కలెక్టర్ రాజర్శి షా   •   విజయ రమణారావుకు క్యాబినెట్ మంత్రి హోదాపై సంబరాలు   •   రాష్ట్ర బాధ్యతలతో సందీప్‌కు సన్మానం   •   జాతీయ పతాక గౌరవాన్ని చాటిన లయన్స్ క్లబ్ నేరేడుచర్ల   •   ప్రభుత్వ స్థలాలపై నిఘా ఉంచాలి   •   హుస్నాబాద్‌లో మూడు జిల్లాల అధికారులతో జరిగే ఎల్‌నినో సమీక్ష ఏర్పాట్ల పరిశీలన   •  

శ్రీవారిని దర్శించుకున్న రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర

30-12-2025 12:01 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): ముక్కోటి ఏకాదశి సందర్భంగా టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తన కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి మంగళవారం ఉదయం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. వద్దిరాజు రవిచంద్ర సోదరులు కిషన్, దేవేందర్, వెంకటేశ్వర్లు తోపాటు సోదరీమణులు బంధుమిత్రులతో కలిసి శ్రీవారిని బ్రేక్ సమయంలో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలతో, శాంతి సౌభాగ్యాలతో తులతూగాలని, అలాగే కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు చెప్పారు.