05-07-2025 01:39:54 AM
ఆనంద్బాగ్ నుంచి ర్యాలీగా వెళ్లిన మైనంపల్లి
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 4 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు ర్యాలీగా తరలివెళ్లారు. ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని పీవీఎన్ కాలనీ కార్పొరేటర్ కార్యాలయం నుంచి కార్పొరేటర్ వై ప్రేమ్కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీగా తరలివెళ్లారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సత్యమూర్తి, బి బ్లాక్ అద్యక్షుడు వెంకటేష్ యాదవ్, బాబు సత్యనారాయణ, సంపత్రావు, గుండా నిరంజన్, రాందాస్, సంతోష్ ముదిరాజ్, ఉపేందర్, బ్రహ్మయ్య, శంకర్రావు, మోహిన్, మౌసిన్ రాము పాల్గొన్నారు.