16 April, 2026 | 9:05 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

అయోధ్యలో వైభవంగా రామాలయం ధ్వజారోహణం

25-11-2025 12:07 PM

ఉత్తరప్రదేశ్: అయోధ్యలో రామాలయం ధ్వజారోహణం(PM Modi Ayodhya Temple Flag Hoisting) వైభవంగా జరిగింది. ఆలయ శిఖరంపై ప్రధాని నరేంద్ర మోదీ కాసాయపతాకాన్ని ఆవిష్కరించారు. అభిజిత్ ముహూర్తంలో రామాలయ శిఖరంపై ధ్వజారోహణం చేశారు. అయోధ్య రామమందిర నిర్మాణం ధ్వజారోహణంతో సంపూర్ణమైంది. 2020 ఆగస్టు 5న రామమందిరం నిర్మాణానికి భూమి పూజ చేశారు. అయోధ్యలో 2024 జనవరి 22న బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ధర్మధ్వజంపై శ్రీరాముడు, సూర్యుడు, ఓం, కోవిదర చెట్టు చిహ్నాలున్నాయి. జెండాపై రాముడి తేజస్సు, శౌర్యాన్ని సూచించేలా చిహ్నాలున్నాయి. అపూర్వ ఘట్టానికి 7 వేల మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. అయోధ్య బాలరాముడికి ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు.