19 March, 2026 | 11:20 AM

ఐక్యతను పెంపొందించేది రంజాన్

18-03-2026 12:00 AM

ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, మార్చి 17(విజయక్రాంతి): రంజాన్ పండుగ ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తున్నదని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా మంగళవారం ముషీరాబాద్ లోని బాపూజీనగర్‌లో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు తలారి శ్రీకాంత్ ము దిరాజ్ ఆధ్వర్యంలో 200 మంది ముస్లిం మైనార్టీలకు నిత్యవసర కిట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా  ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో పేద ప్రజలకు అండగా ఉంటూ వారి అవసరాలను తీర్చాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో  డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కొండా శ్రీధర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు తలారి శ్రీకాంత్ ముదిరాజ్, పి. శ్రీధర్ చారి, ఎయిర్టెల్ రాజు, డివిజన్ మాజీ అధ్యక్షుడు బిక్షపతి యాదవ్, పార్టీ నాయకులు నాని, గౌస్, ఖలీల్, వీరేష్, పట్నం నరేష్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.