13 May, 2026 | 10:31 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

పోటీగా సాగిన తైబజార్ వేలం..రూ.6 లక్షలకు పైగా ఆదాయం..

18-03-2026 12:00 AM

సిరికొండ, మార్చి 17 (విజయ క్రాంతి): నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని  సిరికొండ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో తైబజార్ వేలంపాటను సర్పంచ్ సాయిచరణ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. గ్రామపంచాయతీ ఆదాయ వనరులను పెంపొందించేందుకు నిర్వహించిన ఈ వేలంలో పలువురు ఆసక్తి గల వ్యక్తులు పాల్గొని పోటీగా బిడ్లు వేశారు. తీవ్ర పోటీ మధ్య హమాలి భూమన్న అత్యధికంగా రూ.6,03,200 బిడ్ నమోదు చేసి తైబజార్ హక్కులను దక్కించుకున్నారు.

ఈ వేలం కార్యక్రమం వీడీసీ సభ్యులు, గ్రామపంచాయతీ అధికారులు, ఇతర సభ్యుల సమక్షంలో పారదర్శకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సాయిచరణ్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణలో ఇలాంటి వేలాల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.