23-06-2025 07:12:10 PM
పాపన్నపేట: పురుగు మందు సేవించి చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని మల్లంపేట గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఏఎస్సై తుక్కయ్య(ASI Thukkaiah) కథనం మేరకు వివరాలు... గ్రామానికి చెందిన చింతకుంట గంగయ్య(46) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల కొంతకాలంగా ప్రతి నిత్యం మద్యం సేవిస్తున్నాడు. ఈనెల 15న సాయంత్రం మద్యం సేవించి ఇంటికి వచ్చాడు.
ఈ విషయమై భార్యభర్తలకు జరిగిన గొడవ వల్ల మనస్తాపం చెందిన అతను అదే రోజు మద్యంలో పురుగు మందు కలిపి సేవించాడు. ఇంటికి వచ్చి వాంతులు చేసుకున్నాడు. ఇంట్లో వారు అడిగిన ఏమీ చెప్పలేదు. ఈనెల 19న చికిత్స నిమిత్తం మెదక్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం గాంధీకి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కూతురు భవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.