23-10-2025 02:03:26 AM
హనుమకొండ,అక్టోబర్ 22 (విజయ క్రాంతి): అంబేద్కర్ సర్కిల్,హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా హైడ్రా కమిషనర్ ఐపీఎస్ అధికారి ఏ.వి. రంగనాథ్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి.గతంలో వరంగల్ పోలీస్ కమిషన ర్ గా పని చేసిన సమయంలో కబ్జా రా యుల్ల నుండి పేదవారి భూములను రక్షించి వారికి న్యాయం చేసినందుకు గాను వారి సేవలను గుర్తుంచుకుంటూ హన్మకొండ జూలైవాడ కు చెందిన బూర సన్నీ ఆధ్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమానికి కాజీపేట ట్రాఫిక్ ఎస్ఐ.శ్రావణ్ కుమార్ హాజరై కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేసి, సంబరాలు జరుపుకున్నారు.
అనంతరం సుమారు 200 మంది మున్సిపల్ కార్మికులకు వచ్చే చలి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని, ఉన్ని దుస్తులను పంపిణీ చేశారు. సాధారణంగా రాజకీయ నాయకులు లేదా సినీ నటుల జన్మదిన వేడుకలను జరుపుకునే ప్రజలు వరంగల్ పోలీస్ కమిషనర్ గా ప్రజలకు ఎన్నో సేవలు చేసిన కమిషనర్ రంగనాథ్ ను గుర్తుపెట్టుకుని జన్మదిన వేడుక లను జరుపుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేశాయి.ఈ కార్యక్రమంలో పి.రాజు,ర మేష్,షఫీ, ప్రశాంత్ ,సమీర్, నరేష్ తో పాటు వివిధ డివిజన్ల మున్సిపాలిటీ జవాన్లు, పారిశుద్ధ కార్మికులు తదితరులుపాల్గొన్నారు.