1 July, 2026 | 6:31 PM

Breaking News

ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •   రైతు భరోసా చారిత్రక ఘట్టం.. రైతుల కోసం లక్ష కోట్ల వ్యయం: ఎమ్మెల్యే రాగమయి   •  

రాపిడ్ ,ఓలా, ఉబర్, ప్రైవేట్ సంస్థలను రద్దు చేయాలి: జమలయ్య

09-04-2025 01:26 AM

ఆర్డిఓ ఆఫీస్ ముందు ధర్నా...

కొత్తగూడెం,ఏప్రిల్ 8 (విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో రాపిడో, ఓలా, ఉబర్ ప్రైవేటు సంస్థలను తక్షణమే రద్దు చేయాలని ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ డిమాండ్ చేశారు. మంగళవారం కొత్తగూడెం ఆటో వర్కర్స్ యూనియన్ ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీవో ఆఫీస్ ఎ దుట ధర్నా  చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కొత్తగూడెం పట్టణం సుమారు, నాలుగు కిలోమీటర్ల వైశాల్యం గల పట్టణంలో  రాపిడ్ ,ఓలా, ఉబర్ ప్రైవేటు సంస్థలు సేవలు అవసరం లేదన్నారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  మహిళా సోదరీమణులకు, మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్సు ఏర్పాటు చేయటం వలన, ఇప్పటికే ఆటో మోటర్ రంగం దయ నీయ  పరిస్థితిలోకి మెట్టబడిందని, నిరుద్యోగ యువత, ఉద్యోగాలు లేక ఆటో వృత్తిపై జీవనధారంగా చేసుకొని, ప్రభుత్వంపై ఆధారపడకుండా, కుటుంబాలను  పోషించుకొంటున్న తరు ణంలో కొత్తగూడెం పట్టణంలో,

ఆటో డ్రైవర్లకు కొరకరాని  కొయ్యగా రాపిడ్ ఓలా, ఊబర్ లు తయారయ్యాయని, వాటిని రద్దుచేసి ఆటో డ్రైవర్లని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశా రు.అనంతరం పలు డిమాండ్ తో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవో కు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మర్రి కృష్ణ, అబ్బులు,  కృష్ణ, అమిదు, లక్ష్మణ్ ,భాష ,భాస్కర్, కోటి, రామరాజు,  పట్టణంలో 14 అడ్డాల అధ్యక్ష కార్యదర్శులు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు..