03-06-2025 12:00:00 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): జిల్లా ఆస్పత్రిలో వై ద్యులు సోమవారం అరుదైన శస్త్ర చికి త్స చేశారు. ఆసుపత్రి సూపరిండెంట్ ప్రవీణ్ విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ ప్రమాదాలలో కాలు లేదా చేయి విరిగిపోయినప్పుడు రాడ్, ప్లేట్స్ అమర్చి చికిత్స చేస్తారు. రాడ్, ప్లేట్స్ను కొన్ని సంవత్సరాల తర్వాత తొలగించవలసి ఉంటుంది.
జిల్లాలోని బెజ్జూర్ మండల కేంద్రానికి చెందిన 14 సంవత్సరాల రామ్చరణ్ అనే వ్యక్తికి ఐదు సంవత్సరాల క్రితం ప్రమాదంలో కాలుకు వేసిన రాడ్డును (ఇంప్లాంట్ రిమూవల్ ఆఫ్ క్లావికల్ బోన్ ఆపరేషన్తో) తొలగించారన్నారు. జిల్లా కేంద్రంలో మెడికల్ కళా శాల ఉండడంతో రానున్న రోజుల్లో జిల్లా హెర్నియా, ట్యూబెక్టమీ, వ్యాసక్టమీ ఆపరేషన్లు కూడా అందుబాటు లోకి రానున్నట్లు తెలిపారు.
రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించే దిశ గా ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. ఆపరేషన్ విజయవంతంగా చేసిన వైద్యుడు తిరుమలేష్, నర్సింగ్ స్టాఫ్ సుమిత్ర, హేమలతతో పాటు థియేటర్ అసిస్టెంట్ మౌనికను అభినందించారు. అయితే జిల్లా ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు కూడా అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో రోగులతో పాటు జిల్లా కేంద్రవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి సూపరింటెండెట్లు కృష్ణ, సుభాష్లు పాల్గొన్నారు.