calender_icon.png 6 June, 2025 | 11:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీలను నెరవేరుస్తున్నాం

03-06-2025 12:00:00 AM

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య

నిర్మల్ జూన్ 2( విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనం గా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఫైనాన్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల పూలమొక్కలు అందించి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా చెర్మన్ పోలీసులు గౌరవ స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర ఫైనాన్ కమిషన్ ఛైర్మెన్ మాట్లాడుతూ, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిర్మల్ జిల్లా ముందంజలో పయనిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో పదకొండేళ్లునిండాయని, ఈవిశిష్టసందర్భంలో వేడుకలకు విచ్చేసిన జిల్లాప్రజలకు హృదయపూర్వక శుభాభినందనలు తెలిపేరు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో మహాలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసా, కొత్తరేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇండ్లపథకం వంటి పథకాల ద్వారా అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వం సహాయాన్ని అందిస్తోందని జిల్లా ప్రగతిని వివరించారు.

అనంతరం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలను ప్రదర్శించి అలరించారు. ఆతర్వాత విద్యారులకు బహుమతులను అందజేశారు. అలాగే  వ్యవ సాయ శాఖ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ  సహకరంతో రైతులకు విత్తన ఉత్పత్తి కొరకు నాణ్యమైన ఫౌండేషన్ విత్తనాలను ఉచితంగా అందజేశారు.

నిర్మల్ జిల్లాలో మాదకద్రవ్యాల నిర్ములనకు సంబంధించిన పోస్టర్లను ఛైర్మెన్, జిల్లా కలెక్టర్, ఎస్పీ అధికారులు ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేకు కత్తిరించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నిర్మల్ జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పటిష్టమైన చర్యలుచేపడుతున్నామని తెలిపారు. జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆద్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో కళాజాత ప్రదర్శనల ద్వారా మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, వయోవృద్ధుల సంక్షేమ చట్టాలు, ఎస్సి, ఎస్టి అట్రాసిటి, బాలల చట్టాలపై విస్తృత అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.

జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల నిర్ములనకు పోలీస్ శాఖ ద్వారా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండేలా కళాశాలలు, విద్యాసంస్థలలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు తనిఖీల వివరాలను వెల్లడించారు. 

ఈ వేడుకల్లో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్,  వివిధ శాఖల అధికారులు, సిబ్బం ది, పుర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, తదితరులు, పాల్గొన్నారు.