24-06-2025 01:29:49 AM
క్యాన్సర్ ఇనిస్టిట్యూట్లో రోబోటిక్ స్కార్లెస్ థైరాయిడ్ సర్జరీ విజయవంతం
హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): దేశంలోనే మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ గొప్ప విజయాన్ని సాధించింది. డాక్టర్ అజయ్ వరుణ్రెడ్డి (సీనియర్ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్, క్యాన్సర్ సర్జన్) ఆధ్వర్యంలో మొదటి రోబోటిక్ స్కార్లెస్ థైరాయిడెక్టమీ ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. ఇది మెడికవర్ గ్రూప్ చరిత్రలోనే భారతదేశంలో, అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా మొదటిసారి. ఈ రోబో టిక్ స్కార్లెస్ థైరాయిడ్ ఆపరేషన్ చాలా అరుదుగా జరుగుతుంది.
భారతదేశంలో కేవలం నాలుగైదు ఆసుపత్రులకు మాత్రమే దీనికి కావాల్సిన అధునాతన టెక్నాలజీ, నిపుణులైన సర్జన్లు ఉన్నారు. ఇప్పుడు, మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ కూడా ఆ అరుదైన గ్రూపులో చేరింది. ఇక్కడ సాధారణ థైరాయిడ్ ఆపరేషన్కు బదులుగా, మెడ మీద మచ్చ లేకుం డా అత్యాధునిక శస్త్రచికిత్స అందిస్తారు. ర్యాబిట్ పద్ధతి థైరాయిడ్ ఆపరేషన్లో ఒక కొత్త పద్ధతి. ఇందు లో మెడ మీద కోత పెట్టకుండా, చేతి కింద (చంక), ఛాతీ పైభాగంలో దాచి ఉంచే చిన్న కోత ద్వారా థైరాయిడ్ గ్రంథిని చేరుకుంటారు.
ఈ రోబోటిక్ పద్ధతి వల్ల కోలు కోవడం వేగంగా జరుగుతుంది. నొప్పి తక్కువగా ఉంటుంది. ఇది యువకులకు, ఉద్యోగులకు, అందాన్ని కోరుకునే వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఆపరేషన్ కోసం తమ దేశాల్లో ఈ సదుపాయం లేని సూడన్ దేశానికి చెందిన 50 సంవత్సరాల శర్ఫీఫ్ అబ్దుల్లా మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్కు వచ్చారు. వారికి కూడా ర్యాబిట్ పద్ధతిలో ఆపరేషన్ చేశారు. 48 గంటల్లోనే డిశ్చార్జ్ చేశారు. ఆపరేషన్ జరిగినట్లు ఎక్కడా ఎలాంటి గుర్తు లేదు.