24-06-2025 01:31:20 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 23 (విజయక్రాంతి): నాగోల్ డివిజన్లోని బీజేపీ కార్యాలయంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ము ఖర్జీ జయంతి సందర్భంగా బలిదాన్ దివస్ను నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణాసురేందర్యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించా రు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మా ట్లాడుతూ.. “డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దేశ సమగ్రత, ఏకతా కోసం ప్రాణాలు అర్పించిన మహాత్ముడు. ఆయన ఏ దేశానికీ రెండు రాజధానులు ఉండవు, రెండు జెండా లు ఉండవు అనే నినాదం ద్వారా ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా చరిత్రాత్మక పోరాటం చేశారు. దేశ యువత ఆయన త్యాగాన్ని గు ర్తుంచుకొని దేశాభివృద్ధి కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది” అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి, రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు సామల రంగా రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వనపల్లి శ్రీనివాస్రెడ్డి, కార్పొరేటర్లు, నాగోల్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు ఫంగ శ్రీకాంత్, బీజేపీ నాయకులు సి ద్ధ ఐలయ్య, ఫంగ శ్యామ్, నూకల పద్మారెడ్డి, రేణుక, సరస్వతి, పద్మారెడ్డి, సంజీవరెడ్డి, ము నీందర్, కన్న యాదవ్, నరేష్ యాదవ్, రా ము, సీహెచ్ శివ, సంతోష్, శివ పాల్గొన్నారు.