27 February, 2026 | 3:38 PM

మెడికవర్‌లో అరుదైన చికిత్స

27-02-2026 12:00 AM

కీళ్ల నొప్పులకు ‘లో-డోస్ రేడియోథెరపీ’

హైదరాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. లో-డోస్ రేడియోథెరపీ కీళ్లలోని దీర్ఘకాలిక వాపును తగ్గిం చి, నొప్పిని నియంత్రించడంలో సమర్థవంతంగా పనిచేస్తున్నదని చెప్పా రు. ‘ఇది పూర్తిగా నాన్-ఇన్వేసివ్ విధానం. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా అవుట్పేషెంట్ పద్ధతిలో చికిత్స పొందవచ్చు.

గ్రేడ్ 2 మరియు గ్రేడ్ 3 ఆస్టియో ఆర్థరైటిస్ రోగులకు ఇది ఎంతో మేలు చేస్తుం ది’ అని తెలిపారు. అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం, ఎల్‌డీఆర్‌టీ ద్వారా కీళ్ల కదలికలు మెరుగుపడటమే కాకుండా, నొప్పి నుంచి గణనీయమైన ఉపశమనం లభిస్తున్నట్టు వెల్లడైంది. దీర్ఘకాలిక కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు నిపుణుల సలహా మేరకు ఈ ఆధునిక చికిత్సను వినియోగించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.