26 April, 2026 | 11:04 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

రేషన్ షాపు సీజ్..

06-02-2025 07:49 PM

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని అంబేడ్కర్ కాలనీలో గల రేషన్ షాపు(నెంబర్-15)ను రెవెన్యూ అధికారులు గురువారం సాయంత్రం సీజ్ చేశారు. రేషన్ షాపులో ఉండాల్సిన కోటా కంటే అధికంగా బియ్యం నిల్వలు ఉన్నట్లు అధికారులు గుర్తించి తహశీల్దార్ రఫతుల్లా హుస్సేన్, డిప్యూటీ తహశీల్దార్ మధుసూదన్, ఆర్ ఐ అజీజ్ అబ్దుల్, సిబ్బందితో కలిసి షాపులో తనిఖీలు నిర్వహించి దుకాణాన్ని సీజ్ చేశారు. షాపునకు కేటాయించిన కోటా కంటే అధనంగా 9 క్వింటాళ్ల బియ్యం ఉండటంతో సీజ్ చేసి, డీలర్ గద్దల వెంకటస్వామిపై కేసు నమోదు చేశారు. తనిఖీలో ఎంఆర్ఐ స్వప్న, సీనియర్ అసిస్టెంట్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.