26 April, 2026 | 6:05 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి

26-04-2026 04:29 PM

కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డిని కలిసిన ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించి కూలీలకు ఉపాధి కల్పించాలని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ అన్నారు. మేరకు ఆదివారం హైదరాబాదులో కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి ని కలిసి వారు వినతిపత్రం అందజేశారు. అంకం మౌనిక పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం బిజెపి జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ ఆధ్వర్యంలో బిజెపి కౌన్సిలర్లు కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డిని కలిశారు.

ఈ సందర్భంగా ఖానాపూర్ పట్టణం గతంలో జిపిగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం ఉండేదని ప్రస్తుతం ఆ సౌకర్యం లేకపోవడంతో మున్సిపాలిటీ కూలీలకు ఉపాధి లేకుండా పోయిందని దానిని తిరిగి పునః సమీక్షించాలని, దాంతోపాటు పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజ్ ,100 పుడుకలు ఆసుపత్రి, నూతన మున్సిపాలిటీ భవనానికి నిధులు మంజూరు చేయాలని వారు పట్టణ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బొప్పారపు సత్యవతి, గుమ్ముల ఆనంద్ కుమార్ ,ప్రకాష్ గౌడ్, తదితరులు ఉన్నారు.