05-02-2026 05:49:39 PM
అశ్వాపురం, ఫిబ్రవరి 5 ,(విజయక్రాంతి):మండల పరిధిలోని పాములపల్లి, మిట్టగూడెం, జగ్గారం, అశ్వాపురం గ్రామాల్లోని రేషన్ దుకాణాలతో పాటు మండల కేంద్రంలోని ఎంఎల్ఎస్ పాయింట్ను గురువారం అసిస్టెంట్ కలెక్టర్, తహసీల్దార్ సౌరబ్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రేషన్ పంపిణీ ప్రక్రియపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. రేషన్ నిర్వాహకులు అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మిట్టగూడెంలోని హైస్కూల్ను సందర్శించి ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడారు.