1 July, 2026 | 1:02 AM

ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన ఆర్డీవో విజయ కుమారి

01-07-2026 12:00 AM

బోధన్, జూన్30 (విజయ క్రాంతి): బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లి మండలంలో జాన్కంపేట్,ఎడపల్లి గ్రామాలలో కొనసాగుతున్న ఎస్ ఐఆర్ ప్రక్రియ పనితీరును మంగళవారం రోజున ఆయా పోలింగ్ స్టేషన్ ల పరిధిలో బోధన్ ఆర్డీవో విజయ కుమారి సందర్శించి పరిశీలించారు.ఈ సంద ర్బంగా ఎస్‌ఐఆర్ లో భాగంగా ఎన్యుమరేషన్ ప్రక్రియ ను ఆర్డీవో పరిశీలించారు.బిఎల్డీ లు,బిఎస్‌ఏ లతో మాట్లాడి చర్చించారు.ఎన్నికల సంఘం ఆదేశాల మేర కు గడువులోపు ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసే ల చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.

ఈ సంద ర్బంగా ఆర్డీవో విజయ కుమారి సిబ్బంది ఎన్యూమ రేష న్ నమోదు పనితీరును క్షుణ్ణంగా పరిశీలించి,పలు సూచనలు చేశారు.అనంతరం తహసీల్దార్ కార్యాల యాన్ని సందర్శించారు. రెవెన్యూ భూములు, ధరణి, కీ సంబందించిన పలు అంశాలపై తహసీల్దార్ దత్తాద్రి తో ఆర్డీవో విజయ కుమారి చర్చించారు. ఆర్డీవో వెంట తహ సీల్దార్ దత్తాద్రి, ఆరొ.రాజు, సిబ్బంది రఘు, సంజీవ్, బిఎల్బీ లు నరేష్, దుబ్బాస 3ద్,సౌమ్య,వీణ, సావిత్రి, గంగామణి,లు ఉన్నారు.