27-06-2025 02:22:39 AM
మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ జూన్ 26 (విజయ క్రాంతి) : భవిష్యత్తులో బాగుపడేలా బాగా చదవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఒకేషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మహబూబ్ నగర్ పట్టణం లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల లో గురువారం నిర్వహించిన అప్రెంటీస్షిప్, జాబ్ మేలా కార్యక్రమానికి,మహబూబ్ నగర్ పట్టణం లోని మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో ఉన్న మెప్మా కా ర్యాలయంలో ఆర్పీలకు (మహిళా సంఘాల సభ్యులకు ) మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో, సెట్విన్ సహకారం తో ఉచిత కంప్యూటర్ శిక్షణ అందజేస్తున్నారు.
ఈ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుతున్న ఆర్పీలకు (మహిళా అభ్యర్థులకు )ఎమ్మెల్యే గారు తన సొంత నిధులతో కంప్యూటర్ శిక్షణ మెటీరియల్స్ ను అందజేశారు. హాజరై మాట్లాడారు. దేశంలోని వివిధ కంపెనీలే కా కుండా మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులు కూడా మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇక్కడ వచ్చారని ఆయన చెప్పారు. ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన మీరంతా కంపెనీ ప్రతినిధులు నిర్వహించే ఇంటర్వ్యూ లలో విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
అంతకుముందు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన మహబూబ్ నగర్ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ విద్యార్దులు పవన్, పావని లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, రాష్ట్ర పరిశీలకులు నండూరి శ్రీనివాస్, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వసుంధర, ప్రభు త్వ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ భగవాణి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.