calender_icon.png 27 June, 2025 | 6:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదకద్రవ్యాల నియంత్రణ అందరి బాధ్యత

27-06-2025 02:22:46 AM

జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ. పాల్గొన్న కలెక్టర్ జిల్లా అధికారులు

యాదాద్రి భువనగిరి జూన్ 26 ( విజయ క్రాంతి ): మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, యువత చెడు మార్గాల పట్ల ఆకర్షితం కాకుండా తల్లిదండ్రుల పర్యవేక్షించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. గురువారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా భువనగిరి జూనియర్ కాలేజీ నుండి ర్యాలీని  ప్రారంభించారు.

యువత చెడు అలవాట్ల వైపు ఆకర్షితులైతే వచ్చే నష్టాలు, కుటుంబంలో మన తల్లిదండ్రులు, మన కుటుంబీ కులు పొందే దుఃఖం అధికంగా ఉంటుందని, చెడు అలవాట్లకు మొదటి నుంచి దూరంగా ఉండాలని తెలిపారు.  ఎక్సైజ్ సూపరింన్టేడెంట్ విష్ణు మాట్లాడుతూ నేటి యువత రేపటి భావి భారత పౌరులని, వీరిలో కొంతమంది డ్రగ్స్ కు ఆకర్షితులైతే దేశ భవిష్యత్తు నాశనం అవుతుందని, దీనిని గుర్తించి డ్రగ్స్ వల్ల కలిగే విపరీత పరిణామాలపై అవగాహన పెంచుకొని దూరంగా ఉండాలని  సూచించారు.

అడిషనల్ డీసీపీ లక్ష్మీ నారాయణ మాట్లడుతూ డ్రగ్స్ తో పాటు, గుట్కా, గంజాయి, మాదక ద్రవ్యాలు, సిగరెట్ మొదలగు చెడు అలవాట్లకు సైతం దూరంగా ఉండాలన్నారు జిల్లా సంక్షేమ అధికారి నరసింహ రావు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణ చాలా ఆకీలకమని, వీటిని ఎట్టి పరిస్థితులలో కోల్పోవద్దని ఆయన పేర్కొన్నారు. అడిషనల్ డీసీపీ లక్ష్మీ నారాయణ. ఎక్సైజ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి, డిప్యూటీ డీఎంఎండ్ ఎచ్ ఓ శిల్పిణి. మున్సిపల్ కమీషనర్ Acp శ్రీనివాస్ నాయుడు. సిడిపిఓలు. జిల్లా సంక్షేమ అధికారి సిబ్బంది. అంగన్వాడి టీచర్స్  పాల్గొన్నారు.

డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

తుంగతుర్తి, జూన్ 26: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని.. అందుకు పోలీసుశాఖ, యువత, సమాజంలోని అన్ని వర్గాల వారు సమష్టిగా కృషి చేయాలని తుంగతుర్తి తహసిల్దార్ దయానంద్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం-అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురసరించుకొని తుంగతుర్తి మండల కేంద్రంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ర్యాలీలో  పోలీసు, ఎక్సైజ్ శాఖ, అధికారులు వివిధ పాఠశాలల విద్యార్థులతో అంబేద్కర్ చౌరస్తా నుండి గాంధీ చౌరస్తా వరకు గురువారం ర్యాలీ నిర్వహించారు. 

తహసిల్దార్ దయానంద్, సీఐ నరసింహారావు, ఎక్సైజ్ సీఐ రజిత, సిడిపిఓ శ్రీజ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.  తుంగతుర్తి మద్దిరాల, నూతనకల్ ఎస్త్స్రలు క్రాంతి కుమార్, వీరన్న, ప్రవీణ్ కుమార్ బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.