calender_icon.png 27 June, 2025 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎప్పుడు లేనంతగా అభివృద్ధి చేస్తున్నాం

27-06-2025 02:20:55 AM

- దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి 

 చిన్నచింతకుంట జూన్ 26 : కానీ ఇవన్నీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని యంఎస్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వివిధ గ్రామాల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యమన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను రెండు సార్లు మోసం చేసిందన్నారు.

పదేళ్లు అధికారంలో ఉండి గత ప్రభుత్వం, మాజీ ఎమ్మెల్యే చిన్న చింతకుంట మండల కేంద్రంలో ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలోనే మొదటి విడతలోనే 65 ఇండ్లను చిన్న చింతకుంట మండల కేంద్రానికి ఇచ్చామని, చిన్న చింతకుంట మండల వ్యాప్తంగా 503 ఇండ్లను ఇచ్చామని అన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి, చిప్ప చేతికిచ్చిన ఇచ్చిన మాట మేరకు ఒక్కొక్కటిగా హామీలను నెరవేరుస్తున్నామన్నారు, అందులో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 10 లక్షల ఆరోగ్య శ్రీ, 500 లకే సిలిండర్, 2 లక్షల రుణమాఫీ, 500 బోనాస్, సన్న బియ్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ఈ సంవత్సరం నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేసిందని, ఈ ఇండ్ల నిర్మాణాలు పూర్తయిన వెంటనే అదనంగా 1000 ఇండ్లు మంజూరు అవుతాయని పేర్కొన్నారు, ఇల్లు రాలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విడతల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని తెలియజేశారు. మొదటి విడతలో ఇల్లు మంజూరైన వారు తక్షణమే తమ ఇండ్ల నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసుకోవాలన్నారు. నిర్మాణ దశలను బట్టి సకాలంలో బిల్లులు వచ్చేలా చూస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.