25-06-2025 12:41:21 AM
కలెక్టర్ స్నేహ శబరీష్ ములకనూర్ ఎరువుల గోదాం పరిశీలన
భీమదేవరపల్లి ,మే 24( విజయ క్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరులోని ములుకనూరు సహకార గ్రామీణ పరపతి మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎరువుల గోదాం ను హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మంగళవారం పరిశీలించారు. గోదాంలోని ఎరువుల బస్తాలు, యూరియా బస్తాలు, ఇతర ఎరువులను కలెక్టర్ పరిశీలించి వాటి వివరాలు అని అడిగి తెలుసుకున్నారు.
ఎరువులకు సంబంధించిన క్రయవిక్రయాలకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. రికార్డులు తనిఖీ చేసిన కలెక్టర్ ఇప్పటివరకు ఈ సీజన్లో ఎంత ఎరువులు అమ్ముడయ్యాయని, ఇంకా ఎంత మొత్తం స్టాక్ ఉందని, నిర్వహణ చేస్తున్న తీరు, గత సంవత్సరంలో ఎరువుల క్రయవిక్రయాలు, ఈ గోదాం నుండి ఎరువులను ఎక్కడెక్కడికి తీసుకెళ్తారని వివరాలను వ్యవసాయ అధికారులతో పాటు గోదాం నిర్వాహకులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సీజన్ లో ఎరువుల విక్రయాలు సాఫీగా నిర్వహించాలని, ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, స్థానిక తహసీల్దార్ రాజేష్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.