26 March, 2026 | 12:46 PM

Breaking News

బీఆర్ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం.. ఎవరు కాజేశారో తెలుసు!   •   మార్కాపురం బస్సు అగ్నిప్రమాదం — 13 మంది సజీవ దహనం, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!   •   మార్కాపురం బస్సు దుర్ఘటనపై మోదీ సంతాపం — 14 మంది మృతికి రూ.2 లక్షల పరిహారం!   •   దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రులు   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి   •   కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు   •   డ్రైవర్ నిర్లక్ష్యంతో నరకం — మార్కాపురంలో 13 మంది సజీవ దహనం, డ్రైవర్ పరారు!   •   పట్నంలో ‘పాత రాతియుగం పనిముట్లు’   •   శ్రీరామనవమి నాడు కవిత కొత్త పార్టీ   •  

అవిశ్వాస తీర్మానంపై స్టేకు నిరాకరణ

17-05-2024 12:57 AM

ఎల్లారెడ్డి మున్సిపల్ వివాదంలో హైకోర్టు తీర్పు

కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం

హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ అవిశ్వాస తీర్మానంపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరా కరించింది. అవిశ్వాస తీర్మానం వ్యవహారంపై సమావేశం నిర్వహించవచ్చ ని స్పష్టం చేసింది. అయితే, ఫలితాలను ప్రకటించరాదని షరతు విధిం చింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి గాను ఏప్రిల్ 27న కలెక్టర్ ఇచ్చిన నోటీసును ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారా యణ హైకోర్టులో సవాల్ చేశారు. దీనిని జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి బుధవారం విచారించారు.

అవిశ్వాస తీర్మా నం అమలు తర్వాత ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని, అందువల్ల తీర్మానంపై సమావేశం నిర్వహించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిష నర్ న్యాయవాది కోరారు. ప్రభుత్వ న్యాయవాది బీ మోహనరెడ్డి వాదన లు వినిపిస్తూ.. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ చేతులు ఎత్తే విధానంలో జరుగుతుందన్నారు. కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారు.