28-10-2025 12:00:00 AM
జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా
నిజామాబాద్, అక్టోబర్ 27 (విజయ క్రాంతి): జైళ్ల నుండి విడుదలైన ఖైదీల నుండి సత్ప్రవర్తన కోసమే ఇలాంటి పునారావాస ఉపాధి కేంద్రాల ను ఏర్పాటు చేస్తున్నామని శాఖ డిజి సౌమ్య మిశ్రా తెలిపారు. జైలు నుండి విడుదలైన ఖైదీలు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల ని ఆమె సూచించారు. వివిధ నేరాల కై జైళ్లకు వెళ్లి శిక్ష అనుభవించిన ఖైదీలు వారి మార్పు కోసం రాష్ట్రవ్యాప్తంగా స్వయం ఉపాధి అందిస్తూ వారి లో పూర్తి మార్పు కోసమే జైళ్ల శాఖ రాష్ట్రవ్యాప్తంగా 31 పెట్రోల్ బంకులు జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు డాక్టర్ సౌమ్య మిశ్రా తెలిపారు.
నిజామాబాద్ నగర శివారులోని మల్లారం లో జిల్లా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నూతన పెట్రోల్ బంకును ఆమె సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో ఎవరో ఒకరు తెలుసో తెలియకో నేరాలకు పాల్పడతారని అందుకు కోర్టు వారికి జైలు శిక్ష విధిస్తుందని జైలు శిక్షకు గురైన ఖైదీల లో సత్ప్రవర్తన వచ్చి విడుదల అయిన వారికి కొరకు మళ్లీ నేరాల బాట పట్టకుండా ఉపాధి కోసం ఇలాంటి పునరావాస ఉపాధి కేంద్రాలు ఏర్పాటు వస్తున్నట్లు సౌమ్య మిశ్రా తెలిపారు.
పురుషులకు పెట్రోల్ బంకులతో పాటు, మహిళా ఖైదీల కోసం కుట్టుమిషన్లు ఇతర స్వయం ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేసి వారికి అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఇందుకు గవర్నర్ అనుమతి కావాలని ఒక సందర్భంలో గవర్నెన్స్ ఆమోదం కోసం తాము వెళ్ళినప్పుడు ఖైదీలను విడుదల చేస్తున్నారు. కానీ వారిలో సత్ప్రవర్తన రావడం లేదు అని ప్రస్తావించినప్పుడు తనకు ఇలాంటి పునరావాస ఉపాధి కేంద్రాలు ఖైదీల కొరకు ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తే వారిలో మార్పు వచ్చే కృషి చేసినట్టు అవుతుందని తాను వివరించినట్టు ఆమె తెలిపారు.
ఈ అవకాశాన్ని విడుదలైన ఖైదీలు సద్వినియోగపరుచుకోవాలని ఆమె అన్నారు. కార్యక్రమంలో టీఎం రిటైల్ బిపిసిఎల్ శ్రావణ్ కుమార్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పర్సన్ వెల్ఫేర్ తెలంగాణ అధికారి మురళి బాబు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ పర్సన్ వరంగల్ రేంజ్ అధికారి సంపత్ సూపరిండెంట్ ఆఫ్ జైల్స్ ఆనందరావు కూన తదితరులు పాల్గొన్నారు.