04-06-2025 11:50:40 PM
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పెండింగ్ అంశాలపై సమీక్ష...
ఉపాధి హామీ, మిషన్ భగీరథ పనులపై మంత్రి సీతక్క ఆరా..
హైదరాబాద్ (విజయక్రాంతి): జిల్లాల వారీగా పనుల పురోగతిపై నివేదికలు సమర్పించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను మంత్రి సీతక్క(Minister Seethakka) ఆదేశించారు. బుధవారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పనుల పురోగతి, పెండింగ్ అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గత ఆర్థిక సంవత్సరంలో గ్రౌండింగ్ అయిన పనుల్లో ఎంతమేర పనులు పూర్తయ్యాయి, ఉపాధి హామీ నిధుల ద్వారా చేపట్టిన పనులు, గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ, కొత్త రోడ్ల నిర్మాణం, మరమ్మతులు ఏ దశలో ఉన్నాయని మంత్రి ఆరా తీశారు. జిల్లాల్లో పర్యటించి జిల్లాల వారీగా పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహిస్తానని వెల్లడించారు.