15 March, 2026 | 9:17 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

వెంటనే ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయాలని మంత్రి శ్రీధర్ బాబుకు వినతి పత్రం

18-09-2025 01:23 PM

జిల్లా మత్స్యశాఖ  డైరెక్టర్ పోతరవేని క్రాంతి 

మంథని,(విజయక్రాంతి): వెంటనే ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు( Minister Sridhar Babu) కు గురువారం హైదరాబాద్ లో తన నివాసంలో వినతి పత్రం అందజేశామని జిల్లా మత్స్యశాఖ  డైరెక్టర్ పోతరవేని క్రాంతి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల కోసం అందించే ఉచిత చేప పిల్లల పంపిణీ  ఆలస్యం అవుతున్నందున మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారని, త్వరగా చేప పిల్లల పంపిణీ జరిగేలా చూడాలని, లేనిపక్షంలో నగదు బదిలీ చేపించాలని, అలాగే మత్స్యకారులకు నూతన పథకాలు పెట్టి ఆర్ధికంగా ప్రోత్సహించాలని శ్రీధర్ బాబు కు వినతి పత్రంలో అందజేశామని ఆయన పేర్కొన్నారు. వినతి పత్రంపై సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే మత్స్యకారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, వెంటనే స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు కు క్రాంతి కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.