2 May, 2026 | 6:58 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

వెంటనే ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయాలని మంత్రి శ్రీధర్ బాబుకు వినతి పత్రం

18-09-2025 01:23 PM

జిల్లా మత్స్యశాఖ  డైరెక్టర్ పోతరవేని క్రాంతి 

మంథని,(విజయక్రాంతి): వెంటనే ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు( Minister Sridhar Babu) కు గురువారం హైదరాబాద్ లో తన నివాసంలో వినతి పత్రం అందజేశామని జిల్లా మత్స్యశాఖ  డైరెక్టర్ పోతరవేని క్రాంతి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల కోసం అందించే ఉచిత చేప పిల్లల పంపిణీ  ఆలస్యం అవుతున్నందున మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారని, త్వరగా చేప పిల్లల పంపిణీ జరిగేలా చూడాలని, లేనిపక్షంలో నగదు బదిలీ చేపించాలని, అలాగే మత్స్యకారులకు నూతన పథకాలు పెట్టి ఆర్ధికంగా ప్రోత్సహించాలని శ్రీధర్ బాబు కు వినతి పత్రంలో అందజేశామని ఆయన పేర్కొన్నారు. వినతి పత్రంపై సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే మత్స్యకారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, వెంటనే స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు కు క్రాంతి కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.