15 June, 2026 | 2:47 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

అన్ని రంగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి

13-10-2025 10:49 AM

బహుజన వేదిక రాష్ట్ర కన్వీనర్ కస్తూరి రాములు 

చిలుకూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాకుండా, ప్రభుత్వ ప్రైవేటు విద్యా, ఉద్యోగాల్లో బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని, బహుజన వేదికరాష్ట్ర కన్వీనర్ కస్తూరి రాములు(Bahujan Vedika State Convener Kasturi Ramulu) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకే కాకుండా బలహీన వర్గాలకు కూడా చట్టసభలో రిజర్వేషన్లు కల్పించవచ్చునని రాజ్యాంగంలో వివరించబడింది. 70 ఏళ్ల స్వాతంత్ర భారత దేశంలో నేటికీ బలహీన వర్గాలు రాజ్యాధికారానికి దూరంగా నెట్టివేయబడ్డాయి అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు సాధించడానికి ఎస్సి, ఎస్టి వర్గాలు కూడా మద్దతు ఇవ్వాలని, ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ,బిసి రిజర్వేషన్ల సాధనకు మద్దతు ప్రకటించడం పట్ల రాములు హర్షం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో వ్యవహరించాలని అన్నారు.