అర్జీలను సత్వరం పరిష్కరించండి
09-12-2024 07:33 PM
నిర్మల్ (విజయక్రాంతి): ప్రతి సోమవారం నిర్వహిస్తున్నా ప్రజావాణి అర్జీలను సత్వరం పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్లు పైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్లు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి దరఖాస్తుల స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. అర్జీల పరిష్కారంలో జాప్యం చేస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.






