18-05-2025 12:52:35 AM
దుస్తులు, ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్పై పోర్ట్ ఆంక్షలు
న్యూఢిల్లీ, మే 17: బంగ్లాదేశ్కు భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ శనివారం ఊహించని షాక్ ఇచ్చింది. దేశం నుంచి దిగుమతి అవుతున్న దుస్తులు, ప్రాసెస్డ్ ఫుడ్స్ వంటి వస్తువులపై పోర్ట్ ఆంక్షలు విధించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నోటిఫికేషన్ విడుదల చేశారు. ‘బంగ్లాదేశ్ నుంచి భారత్కు దిగుమతి అయ్యే దుస్తులు, ప్రాసెస్డ్ ఫుడ్స్పై పోర్టు ఆంక్షలు విధిం చాం.’ అని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధీనంలో పని చేసే డీజీఎఫ్టీ ఒక ప్రకటన ను విడుదల చేసింది. భారత్ మీదుగా భూటాన్, నేపాల్ వంటి దేశాలకు ఎగుమతయ్యే వస్తువులకు ఈ ఆంక్షలు వర్తించవని పేర్కొన్నారు.