3 April, 2026 | 2:28 AM

ఐపీఎల్ కోసం రిటర్మైంట్

03-04-2026 12:36 AM

సొంతబోర్డుపై కోర్టుకెళ్లిన తుషారా

కొలంబో, ఏప్రిల్ 2 : ఐపీఎల్ అంటే క్రికెట్ ఫ్యాన్స్‌కే కాదు క్రికెటర్లకు కూడా ఎంతో క్రేజ్. ముఖ్యంగా విదేశీ క్రికెటర్లు ఈ లీగ్‌లో ఆడేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. అయితే అంతర్జాతీయ షెడ్యూల్ లేదా ఫిట్‌నెస్ సమస్యలతో పలు దేశాల క్రికెట్ బోర్డులు విదేశీ ప్లేయర్స్‌కు ఎన్‌వోసీ ఇచ్చేందుకు నిరాకరిస్తుంటాయి.

తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్ళకు ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహించి ఫిట్‌గా ఉంటేనే ఐపీఎల్ ఆడేందుకు అనుమతిచ్చింది. అయితే ఎన్‌వోసీ ఇవ్వలేదంటూ లంక క్రికెటర్ నువాన్ తుషారా కోర్టు మెట్లెక్కాడు. తాను ఫిట్‌గా ఉన్నా ఐపీఎల్ ఆడేందుకు అనుమతించడం లేదని పి టిషన్ దాఖలు చేశాడు. కొలంబో కోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.

అదే సమయంలో అతడు రిటైర్మెంట్ ఆలోచన లో కూడా ఉన్నాడు. తన కాంట్రాక్ట్ పునరుద్ధరించొద్దని కూడా బోర్డుకు ముందే చెప్పి నా ఎన్‌వోసీ ఇవ్వలేదని పిటిషన్‌లో పేర్కొన్నాడు. దీని ప్రకారం చూస్తే ఐపీఎల్ కోసమే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు అర్థమవుతోంది.