2 July, 2026 | 2:27 PM

Breaking News

గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •   రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్   •  

జీహెచ్‌ఎంసీ సీపీఆర్‌వో పదవీ విరమణ

01-09-2024 01:46 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్(సీపీఆర్‌వో)గా సేవలందించిన మహమ్మద్ ముర్తుజా శనివారం పదవీ విరమణ చేశారు. ఆయనను జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, అడిషనల్ కమిషనర్ అడ్మిన్ నళిని పద్మావతి సన్మానించారు. ప్రధాన కార్యాలయం పన్వర్ హాల్‌లో సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఆయనను ఘనంగా సన్మానించారు. సమాచార పౌరసంబంధాల జేడీ అయిన  మహమ్మద్ ముర్తజా అలీ 2021 సెప్టెంబర్ నుంచి సీపీఆర్‌వోగా విధులు నిర్వహించారు. జీహెచ్ ఎంసీలోని వివిధ సర్కిళ్లలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు కూడా పదవీ విరమణ చెందారు. అలాగే హైదరాబాద్ కలెక్టరేట్ సమాచార శాఖలో పనిచేస్తున్న చెంగల రవికుమార్ శనివారం పదవీ విరమణ పొందారు. ఆయనను హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సన్మానించారు.