calender_icon.png 6 June, 2025 | 12:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెవెన్యూ సదస్సులపై ముందుగానే ప్రచారం చేయాలి

05-06-2025 12:33:31 AM

చౌక ధర దుకాణాల్లో రికార్డులు సక్రమంగా నిర్వర్తించాలి 

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, జూన్ 4 ( విజయక్రాంతి ) : గ్రామాల్లో  భూ భారతి రెవెన్యూ సదస్సుల నిర్వహణ పై ముందుగానే ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం వనపర్తి మండలం అంకూర్, బలిజపల్లి గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను జిల్లా కలెక్టర్ సందర్శించారు. రెవెన్యూ సదస్సులో పెట్టిన భూ రికార్డులు, ప్రజల నుండి వచ్చి న దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించారు.     

చౌక ధర దుకాణాల్లో రికార్డులు సక్రమంగా నిర్వర్తించాలి

జిల్లాలోని అన్ని చౌకధర దుకాణాల్లో బియ్యం రికార్డులు సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బుధవారం వనపర్తి మండలంలోని అంకూర్, పెద్దమందడి మండలంలో ని జంగమయ్యపల్లి గ్రామపంచాయతీల్లోని చౌక ధర దుకాణాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చౌక ధర దుకాణాల్లో స్టాక్ రిజిస్టర్ నిర్వహించకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశా రు. ప్రతి చోట జరగకుండా ఆన్లైన్ రికార్డుతో పాటు స్టాక్ రిజిస్టర్, ఇతర రికార్డులు తప్పనిసరిగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను ఆదేశించారు.

బియ్యం ఇచ్చిన రసీదుల ను లబ్ధిదారులకు ఇవ్వాలని సూచించారు. సన్న బియ్యం లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సన్న బియ్యం బాగుందా? ఇదే బియ్యం తింటున్నారా అని అడిగి తెలు సుకున్నారు. చౌక ధర దుకాణాల్లో ఇస్తున్న సన్న బియ్యం బాగుందని దీనినే తింటున్నామని లబ్ధిదారులు కలెక్టర్ కు వివరించారు. ఆర్డిఓ సుబ్రహ్మణ్యం, వనపర్తి తహసిల్దార్ రమేష్ రెడ్డి, పంచాయత్ సెక్రటరీ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.