05-06-2025 12:32:12 AM
మేడ్చల్, జూన్ 4 (విజయ క్రాంతి): మేడ్చల్ పట్టణంలో రైల్వే అండర్ పాస్ పను లు తుది దశకు చేరినందున అటువైపు ఉన్న గ్రామాలకు బస్సు సౌకర్యం పున: ప్రారంభించాలని కాంగ్రెస్ నాయకులు ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ రామారావు కు వినతి పత్రం అందజేశారు. అండర్ పాస్ పనుల వల్ల శ్రీరంగవరం, రాయిలాపూర్, బండ మాదారం, గి గిర్మాపూర్ తో పాటు పలు గ్రామాలకు బస్సు సౌకర్యం నిలిపివేశారన్నారు.
దీంతో ఆయా గ్రామాల విద్యార్థులు మేడ్చల్ రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని తెలిపారు. కొంతమంది విద్యార్థులు మధ్యలోనే చదువు మానేయాల్సి వచ్చిందని వివరించారు. విద్యార్థుల ఇబ్బందులు దృష్టి లో పెట్టుకొని బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.
పనులు పూర్తికాగానే బస్సు ప్రారంభిస్తామని అసిస్టెంట్ మేనేజర్ హామీ ఇచ్చా రని పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వేము ల శ్రీనివాసరెడ్డి తెలిపారు. వినతి పత్రం సమర్పించిన వారిలో వేముల శ్రీనివాసరెడ్డి తో పాటు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షు డు రమణారెడ్డి, సుదర్శన్ రెడ్డి, రఘుపతి రెడ్డి, చంద్రయ్య గౌడ్, టైలర్ రాజు తదితరులున్నారు.