04-06-2025 12:00:00 AM
కలెక్టర్ పమేలా సత్పతి
కొత్తపల్లి, జూన్ 3 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూభారతి నూతన రెవెన్యూ చట్టం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని, భూ సమస్యలు ఉ న్న ప్రజలు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.
మంగళవారం కరీంనగర్ రూరల్ మండలం దుర్షెడు ప్రాథమిక పాఠశాలలో, కొత్తప ల్లి మండలం ఆసిఫ్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన భూభారతి గ్రామ రెవెన్యూ అవగాహనా సదస్సుల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు.
ఇ ప్పటికే జిల్లాలోని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన మండలం సైదాపూర్ లో, అన్ని మండల కేంద్రాలలో రెవెన్యూ అవగాహన సదస్సులు విజయవంతంగా నిర్వహించామని, ప్రజల నుండి భూ సమస్యల అర్జీలు స్వీకరించామని అన్నారు. ఆయా సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను రెవి న్యూ అధికారులు పరిష్కరిస్తున్నారని తెలిపారు.
ఇదే విధంగా జూన్ 20వ తేదీ వరకు అన్ని గ్రా మాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నామని, భూ సమస్యలున్న ప్రజలు ఈ రెవెన్యూ సదస్సులకు హాజరై దరఖాస్తు సమర్పించాలని సూచించారు. రెవెన్యూ సదస్సులో హెల్ప్డెస్క్, రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించి, రైతుల భూసమస్యల దరఖాస్తులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, తహసీల్దార్లు ఎన్.రాజేష్, ఆర్.వెంకటలక్ష్మి, రెవిన్యూ సిబ్బంది, రైతులు, ప్రజలుపాల్గొన్నారు