calender_icon.png 25 January, 2026 | 6:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలి

25-01-2026 04:15:42 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): ఓటు హక్కును నిజాయితీగా, నిర్భయంగా వినియోగించుకోవాలని మాజీ జడ్పీటీసీ సభ్యులు తీగల తిరుమల్ గౌడ్ అన్నారు. ఆదివారం దోమకొండలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తహసీల్దార్ సుధాకర్ ఆధ్వర్యంలో ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి-యువకుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరి ఓటు కీలకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుధాకర్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది, బూత్ లెవల్ అధికారులు పాల్గొన్నారు.