25-01-2026 04:23:23 PM
కల్వకుర్తి: నాగర్కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలంలోని ముచ్చర్లపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ పొలంలోని నీటి కుంటలో మునిగి ముగ్గురు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. గ్రామానికి చెందిన మధు సిరి(14), శ్రీమాన్య(12) రంగారెడ్డి జిల్లా రావిర్యాలకు చెందిన స్నేహ(17) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
హైదరాబాదులో నివసిస్తున్న వీరు సెలవుల నిమిత్తం గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా ఈతకు వెళ్లి నీటి కుంట లోతు అంచనా వేయలేక మునిగి మృతి చెందినట్లు సమాచారం. ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు