7 April, 2026 | 5:13 PM

Breaking News

ఎమ్మెల్యే విజయ రమణారావుకు నిలువెత్తు దండతో ఘనంగా సన్మానం   •   చంద్ర మహంకాళి ఆలయంలో పూజలు   •   గోపాల్పేట్ శ్రీ నల్లపోచమ్మ నూతన ఆలయ కమిటీ ఎన్నిక   •   పేదల స్వంతింటి కల కాంగ్రెస్‌తోనే సాకారం: ధరావత్ వీరన్న నాయక్   •   'టచ్ చేసి చూడు.. పాకిస్థాన్‌ ముక్కలే'! పాక్‌కు భారత్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌   •   గిరిజన గ్రామంలో పోలీసుల గ్రామోత్సవం నిర్వహణ   •   రసాయనాల నియంత్రణతో క్యాన్సర్ నివారణ   •   ఘనంగా జీవీఆర్ జన్మదిన వేడుకలు   •   పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కటింగ్   •   ఐఎన్టీయుసీ కాంట్రాక్ట్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా ఎస్కే బాజీ సాహెబ్   •  

రాష్ట్రంలో ఎండలు షురూ!

16-02-2026 02:10 AM

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

ఖమ్మంలో 34.4 డిగ్రీలు, భద్రాద్రి, సూర్యాపేటలో 34.2 డిగ్రీలు

హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎండలు షురూ అయ్యాయి. ప్రస్తుతం రాత్రి, ఉదయం వేళల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే మధ్యాహ్నానికి వ చ్చేసరికి ఎండలు మండిపోతున్నాయి. రెం డు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ల్లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా నమోదవుతున్నాయి. 30 డిగ్రీల కంటే పైనే ఉంటున్నా యి. దీంతో మధ్యాహ్నం ఉక్కపోత ఉంటోం ది. రాబోయే రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి.

ఆదివారం ఉదయం, రాత్రి వేళల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14 నుంచి 17.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయని తెలంగాణ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక గరిష్ఠ ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఖమ్మంలో 34.4 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో 34.2 డిగ్రీ లు నమోదయ్యాయి. నల్లగొండలో 34 డిగ్రీలు, నిర్మల్, వనపర్తి జిల్లాలో 33.9 డిగ్రీ లు, ములుగులో 33.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుకానున్నట్లు వాతావరణ కేంద్రం సూచించింది. సోమవారం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు అత్యధి కంగా 34.6 డిగ్రీలు నమోదు కాగా, మంగళవారం 34.5 డిగ్రీలు నమోదుకానుంది.