calender_icon.png 16 February, 2026 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో ఎండలు షురూ!

16-02-2026 02:10:48 AM

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

ఖమ్మంలో 34.4 డిగ్రీలు, భద్రాద్రి, సూర్యాపేటలో 34.2 డిగ్రీలు

హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎండలు షురూ అయ్యాయి. ప్రస్తుతం రాత్రి, ఉదయం వేళల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే మధ్యాహ్నానికి వ చ్చేసరికి ఎండలు మండిపోతున్నాయి. రెం డు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ల్లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా నమోదవుతున్నాయి. 30 డిగ్రీల కంటే పైనే ఉంటున్నా యి. దీంతో మధ్యాహ్నం ఉక్కపోత ఉంటోం ది. రాబోయే రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి.

ఆదివారం ఉదయం, రాత్రి వేళల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14 నుంచి 17.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయని తెలంగాణ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక గరిష్ఠ ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఖమ్మంలో 34.4 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో 34.2 డిగ్రీ లు నమోదయ్యాయి. నల్లగొండలో 34 డిగ్రీలు, నిర్మల్, వనపర్తి జిల్లాలో 33.9 డిగ్రీ లు, ములుగులో 33.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుకానున్నట్లు వాతావరణ కేంద్రం సూచించింది. సోమవారం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు అత్యధి కంగా 34.6 డిగ్రీలు నమోదు కాగా, మంగళవారం 34.5 డిగ్రీలు నమోదుకానుంది.