27 June, 2026 | 7:07 PM

Breaking News

జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •  

బస్సు- ట్రక్కు ఢీ: నలుగురు యాత్రికులు మృతి

15-09-2025 10:26 AM

జౌన్‌పూర్: అయోధ్య నుంచి వారణాసికి(Ayodhya to Varanasi) సుమారు 50 మంది భక్తులతో వెళ్తున్న డబుల్ డెక్కర్ టూరిస్ట్ బస్సు లైన్ బజార్‌లోని సెహిపూర్ రైల్వే క్రాసింగ్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, బస్సు డ్రైవర్ సహా నలుగురు మృతి చెందగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారందరూ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

జౌన్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్(Jaunpur Superintendent of Police) డాక్టర్ కౌస్తుభ్ మాట్లాడుతూ... ఈ సంఘటన లక్నో-వారణాసి జాతీయ రహదారిపై సిహిపూర్ గ్రామంలో జరిగిందని తెలిపారు. బస్సులో 50 మంది ఉన్నారని, బస్సు డ్రైవర్ ట్రక్కును ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ప్రమాదం జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ఈ ఢీకొనడం చాలా తీవ్రంగా ఉండటంతో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. స్థానికులు, పోలీసులు కలిసి గాయపడిన వారిని బయటకు తీసి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు బస్సు, ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.