13 May, 2026 | 10:30 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

పోలీస్ పహారాలో యూరియా పంపిణీ

15-09-2025 11:50 AM

చిట్యాల మన గ్రోమోర్ ముందు రైతుల  క్యూ లైన్.

చిట్యాల(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) చిట్యాల మండలకేంద్రంలోని మన గ్రోమోర్ కేంద్రం వద్ద సోమవారం పోలీస్ పహార మధ్య యూరియా పంపిణీ కొనసాగుతోంది.గత నెల రోజులుగా చిట్యాల మండలంలో యూరియా కొరత తీవ్రంగా వేదిస్తోంది. రైతులకు సరిపడా యూరియా నిలువలు లేకపోవడంతో ఇటీవలే రైతు ఆగ్రోస్,ఓడిసిఎంఎస్, నైన్ పాక ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాల వద్ద రైతులు క్యూ లైన్లలో గంటల తరబడి నిరీక్షించిన విషయం తెలిసిందే. తాజాగా  ఉదయం నుంచి  మన గ్రోమోర్ కేంద్రం ఎదుట యూరియా కోసం రైతులు బారులు తీరగా పోలీసులు అక్కడే ఉండి అల్లర్లు కాకుండా యూరియాను రైతులకు సరఫరా చేయడంలో సహకరిస్తున్నారు.కాగా వ్యవసాయానికి సరిపడా యూరియా అందించడం లేదని,తక్షణమే అధికారులు స్పందించి సరిపడా యూరియాను సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.